Breaking News

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి, హెచ్‌బీ కాలనీలో సోనం ఠాకూర్ (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన రాజేందర్ సింగ్ తన కుమార్తె సోనంను మౌలాలి ఇందిరా నగర్‌కు చెందిన ఠాకూర్ యోగేష్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం 4 గంటల సమయంలో తండ్రి రాజేందర్ సింగ్ తన కుమార్తెకు వరుసగా ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన పక్కింటి నివాసి భారతేశ్వరమ్మకు సమాచారం అందించారు. ఆమె వెళ్లి చూడగా, సోనం ఠాకూర్ బెడ్రూమ్‌లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించారు. వెంటనే గమనించి ఆమెను కిందకు దించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, సిబ్బంది వచ్చి పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం తెలుసుకున్న భర్త యోగేష్, ఇతర కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పార్టీల జండాలతో అంబేద్కర్ ను అవమానిస్తారా