మొక్కజొన్న చేలకు అంటుకున్న మంటలు.. ఆర్పేందుకు గ్రామస్తులు, అధికారుల తీవ్ర యత్నం
మన ప్రగతి న్యూస్ గూడూరు
రాజన్పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మొక్కజొన్న చేలకు అంటుకున్నాయి.
గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం నుండి చేలకు మంటలు వ్యాపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పూర్తిస్థాయిలో నష్టం ఎంత జరిగిందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి గిరిధర్ రెడ్డి తెలిపారు.


