Breaking News

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ప్రయత్నం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఆర్టీసీ ఉద్యోగులందర్నీ కలచివేసింది. వివరాలకు వెళ్తే తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సులను నడవనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో లో కండక్టర్,డ్రైవర్లు సమ్మెలో పాల్గొని ఆర్టీసీ బస్సులను నడవనీయకుండా సమ్మెకు మద్ద తెలపాలని కోరడం జరిగింది. ప్రభుత్వo మాత్రం కొంతమంది ప్రైవేటు ఉద్యోగులతో బస్సులను నడపడానికి ప్రయత్నిస్తుంది. ఈ దశలో నర్సంపేట డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కలత చెంది తమ డిమాండ్లను తీర్చాలని డి ఎం ఆఫీస్ ముందర ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకున్నారు. ఈ సంఘటనతో తోటీ ఉద్యోగులు ఆందోళన గురై డ్రైవర్ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం తరలించగా అక్కడినుండి హైదరాబాదులోని నిమ్స్ కు 80 శాతం కాలిన గాయాలతో ఉన్నాడని మెరుగైన చికిత్స కోసం తరలించామని వైద్యులు తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు ఈ సంఘటనతో ప్రధాన రహదారిపై బంద్ చేపట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. పోలీసులు సంయమనం పాటించి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ కల్పించారు.

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ప్రయత్నం