- 5.14 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం
- పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్
మన ప్రగతి న్యూస్ / కాప్రా, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుని నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ నిందితుడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం పట్టుకుంది. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బి-టీమ్ ప్రదీప్ రావు బృందం కాప్రాలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అభిషేక్ అనే నిందితుడు డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి రూ. వేల విలువైన 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ఘట్కేసర్లోని కాప్రా ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ.. డ్రగ్స్ తరలిస్తున్న అభిషేక్ను అదుపులోకి తీసుకున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

