ఆపరేషన్ అయినా నొప్పి తగ్గకపోవడంతో పురుగుల మందు తాగి మృతి
మన ప్రగతి న్యూస్ /గూడూరు:
గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన గాజబోయిన ఎల్లమ్మ(54), భర్త నాగయ్య, గౌడ కులస్థురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా కడుపులో గడ్డలతో బాధపడుతున్న ఎల్లమ్మ గత వారం హన్మకొండలోని సంకీర్తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంది. అయినా గత రెండు రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి చనిపోయింది. మృతురాలి కొడుకు గాజబోయిన క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గూడూరు ఎస్సై బి. గిరిధర్ రెడ్డి తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నా మన్నారు.

