Breaking News

రాహుల్ గాంధీపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం – పమ్మి అశోక్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఘటనను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామకాలలో అవకతవకలు వంటి సమస్యలపై ప్రధానమంత్రి నుంచి సమాధానం కోరేందుకే కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీ చేపట్టిందన్నారు. అలాంటి ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును అణచివేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యలను వినిపించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అసహన వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు.ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచివి కావని అన్నారు. రాహుల్ గాంధీపై జరిగిన ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పమ్మి అశోక్ స్పష్టం చేశారు.

పార్టీ కోసం శ్రమించిన వారికే గుర్తింపు,పదవులు – బూత్ స్థాయి నుంచే బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్