Breaking News

కేసీఆర్ కృషి ఫలితమే సీతారామ ప్రాజెక్టు నీళ్లు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి

సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, నిరంతర కృషి ఫలితంగానే ప్రస్తుతం ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోందని పేర్కొన్నారు.ప్రస్తుతం రోజుకు సుమారు 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న పరిస్థితి నాడు కేసీఆర్ చేపట్టిన మహత్తర ప్రాజెక్టు ఫలితమేనని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, వ్యవసాయ రంగానికి ఇది బలాన్నిస్తోందని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.9 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్‌లు, పైప్‌లైన్లు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలను నిర్మించామని వివరించారు. అధిక సామర్థ్యం గల మోటార్లు, ఆధునిక పంపింగ్ వ్యవస్థలతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా రైతుల భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టు అని పేర్కొన్న పువ్వాడ అజయ్ కుమార్, ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

రాహుల్ గాంధీపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం – పమ్మి అశోక్