Breaking News

ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల

_ విధ్యా బోధనలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

_ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి.

_ విద్యాలయాల ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యత పై ప్రత్యేక దృష్టి సారించి , విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ లోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా విద్యాలయం ఆవరణలో పరిశుభ్రత పనులు పరిశీలించారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి,కూరగాయలు, పండ్లు ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పలు కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్ళారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. నర్సింహులపల్లి, తంగళ్లపల్లి లోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు. స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు.


జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.