Breaking News

పథకం ప్రకారం ఓ వ్యక్తితో కలిసి భర్త హత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.నెమ్లి గ్రామానికి చెందిన టేకుల మైసయ్య, రాధ భార్యాభర్తలు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది భార్య. ఇందుకోసం పథకం ప్రకారం.ఓ వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసి మూటలో కట్టి సోమ లింగాల గుడి వెనుకాల కోనేరులో పడేసింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఓ వ్యక్తితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి