మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ఘడి కోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. శుక్రవారం రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ఘడి కోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు, కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు.