బ్రేకింగ్ న్యూస్
విగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..విగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..
స్పోర్ట్స్

టీమ్‌ ఇండియా అభిమానులకు శుభవార్త: మహమ్మద్‌ షమీ రీఎంట్రీకు సిద్ధం!

టీమ్‌ ఇండియా అభిమానులకు శుభవార్త: మహమ్మద్‌ షమీ రీఎంట్రీకు సిద్ధం!

భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త – స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు! దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ, ఇప్పుడు రంజీ ట్రోఫీలో బంగాల్ తరఫున మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. నవంబర్ 13న మధ్యప్రదేశ్‌తో జరగనున్న ఐదో రౌండ్ మ్యాచ్‌లో పాల్గొననున్నట్లు బంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.

గతంలో కర్ణాటకతో జరిగిన రౌండ్‌లో ఆడాల్సిన షమీ, ఫిట్‌నెస్ లోపంతో దానిని వదిలివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది, జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రంజీ ట్రోఫీలో మెరుపులు మెరిపిస్తే, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో షమీ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా షమీ చివరిసారిగా జట్టులో ఉండగా, ఆ మ్యాచ్‌లో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ గాయం వల్ల విదేశాల్లో సర్జరీ చేయించుకుని, ఒక సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టు పాసైన తర్వాత దేశవాళీ క్రికెట్ ద్వారా తిరిగి సత్తా చాటతానని షమీ తెలిపారు.

నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పాల్గొనే అవకాశంపై మహమ్మద్ షమీ చాలా ఆశాభావంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ ప్రదర్శన అతడికి జాతీయ జట్టులోకి తిరిగి ప్రవేశించే మార్గాన్ని సుగమం చేసే అవకాశం ఉంది.