వర్షం వస్తే బియ్యం తడిసి ముద్దావుతున్నాయి.
జిసిసి భవనం లో ఎలుకలు చొరబడి శౌర్య విహారం.
నూతన జిసిసి భవనం వెంటనే నిర్మించాలి
మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి.
ములకలపల్లి: మండల కేంద్రంలోని ఉన్న శిథిలావస్థకు చేరిన ములకలపల్లి జిసిసి భవనం మండలంలోని పెద్ద సంఖ్యలో సుమారు 1400 రేషన్ కార్డులు ఉన్న జిసిసి భవనం ఈ గత 40 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం హయాంలో నిర్మించారు. ఇప్పుడు పూర్తి గా శిథిలావస్థకు భవనం చేరింది.భవనం లోపల మట్టి తో పాటు బియ్యం కలిసి పోతున్నాయి తినే బియ్యం లో మట్టి రాళ్ళు వస్తున్నాయని రేషన్ కార్డు దారులు వాపోతున్నారు. మండల కేంద్రం లో ఉన్న ప్రజల తో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదివాసి గిరిజన ప్రజలు రేషన్ బియ్యం కోసం వస్తారు.భవనం అసౌకర్యంగా ఉందని వర్షాం కురిసిందంటే రేషన్ షాపులో ఉన్న బియ్యం తడిసి ముద్దాయి పోయి విపరీతంగా ఎలుకలు చొరబడి బియ్యం బస్తాలకు బొక్కాలు పడి బియ్యం మట్టి కలిసిపోతున్నాయని మట్టి కలిసిన బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నారని పలువురు రోదిస్తున్నారు.రాళ్ళాతో కూడిన తడిసిన బియ్యం తిని ప్రజలు ఆనారోగ్య పరిస్థితు ఏర్పడుతుందని కడుపునొప్పి ఇతర ఆనారోగ్యాలు ఏర్పాడే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.వేసవి కాలంలో ప్రజలు బియ్యం తిసుకునేందుకు వస్తే ఎర్రని ఎండలో క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మహిళలు విపరీతంగా ఉన్నా ఎండ లో నిలబడి ఆసుపత్రి పాలైన అనేక సందర్భాలు ఉన్నాయి రేషన్ కార్డుదారులకు మంచినీటి సౌకర్యం ఇతర సౌకర్యాలు లేక రేషన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు మండల ప్రజలు వాపోతున్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి అసౌకర్యంగా శిధిలావస్థకు చేరిన జిసిసి పాత భవనాన్ని తొలగించి వెంటనే నూతన భవనం నిర్మించాని ప్రజలకు సౌకర్యాకరంగా భవన సదుపాయం ఉండే విధంగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.