Breaking News

లంచం తీసుకుంటూ ఏఈ ప్రభులాల్‌ పట్టుబాటు

మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి

మండలంలోని పెద్దఅంబర్‌పేట విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) ప్రభులాల్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరెంట్‌ కనెక్షన్‌, మీటర్‌ మార్పిడి, బిల్లింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఓ వ్యక్తి నుంచి రూ.6 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చు పన్ని, బుధవారం ప్రభులాల్‌ను లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రభులాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి