మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి
మండలంలోని పెద్దఅంబర్పేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రభులాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరెంట్ కనెక్షన్, మీటర్ మార్పిడి, బిల్లింగ్ సమస్యల పరిష్కారం కోసం ఓ వ్యక్తి నుంచి రూ.6 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చు పన్ని, బుధవారం ప్రభులాల్ను లంచం స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రభులాల్ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

