Breaking News

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కూసుమంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు..

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ కూసుమంచి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు, ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి పాఠశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని,వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.విద్యుత్ స్తంభాలు ముట్టుకోవొద్దు అని చెట్లు విరిగిపడే ప్రమాదాలు కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.మట్టి గోడలతో ఉన్న ఇండ్లు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావొద్దు అన్నారు.