Breaking News

డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటనపై ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం సమీక్ష

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టసాధ్యం

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల సరిహద్దులోని అంజనాపురం–జన్నారం గ్రామాల మధ్య నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటన సంచలనం రేపింది. నిమ్మ వాగు దాటే ప్రయత్నంలో డీసీఎం వ్యాన్ నీటి ప్రవాహానికి చిక్కుకుని కొట్టుకుపోయింది. భారీ వర్షాల ప్రభావంతో వాగులో నీటి మట్టం పెరగడంతో డ్రైవర్ కూడా వాహనంతో పాటు గల్లంతైనట్లు సమాచారం.ఈ ఘటనపై బుధవారం సాయంత్రం ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారితో పాటు ఏన్కూర్ ఎస్సై సంధ్య, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. వాగులో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి.అధికారులు డీసీఎం వ్యాన్, డ్రైవర్ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.