మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ ఇందిరా గాంధీ పేరు చరిత్ర గర్వం భారతావనికి నిత్య చైతన్య స్పూర్తి పదం గరీబీ హటావో రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయం 20 సూత్రాల లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతి కోసం పాటుపడిన మహానాయకురాలు భారత తొలిమహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా. శుక్రవారం సంజీవ రెడ్డి భవన్ నందు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజి ఎం యల్ సి పొట్ల. నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు తుమ్మల యుగేందర్ ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ,అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

