Breaking News

సీఎం కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే దొంతి

మన ప్రగతి న్యూస్/వరంగల్

వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా నర్సంపేట నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాల్లో మరియు హన్మకొండ /వరంగల్ జిల్లా కేంద్రాల్లో తీవ్ర పంట మరియు ఆస్తి నష్టం జరగడంతో శుక్రవారం పరిస్థితులను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకి రాగా వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం వరంగల్ జిల్లా కేంద్రంలో సీఎం తో పాటు పర్యటించి తదుపరి హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని సీఎంకి వివరించారు.అదే విధంగా పలు రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సమీక్షా సమావేశంలో సీఎం ప్రకటించారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..