Breaking News

గడ్డి మందు తాగి హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం..

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్

జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జమ్మికుంట పట్టణంలో కలకలం రేకెత్తించింది. జమ్మికుంట పట్టణంలోని ఎస్వి పాఠశాల విద్యార్థులు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారని అయితే విద్యార్థులు హాస్టల్ నుండి బయటికి వెళ్లి ధూమపానం సేవిస్తున్నారని సమాచారంతో సోమవారం ఉపాధ్యాయులు, రామ్ చరణ్ మరియు చరణ్ లను మందలించి వారి తల్లిదండ్రులు తీసుకురావాలని చెప్పారు.దీంతో భయపడిన విద్యార్థులు సోమవారం రాత్రి 12 గంటలకు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం హుటాహుటిన పట్టణంలోని సంజీవని హాస్పిటల్ కు తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారని సమాచారం. యాజమాన్యం నిర్లక్ష్యం వలన విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..