మన ప్రగతి న్యూస్/ పిట్లం:
పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో వైద్యాధికారి సారిక దివ్యాంగ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యం మెరుగుపడేలా ఫిజియోథెరపీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు ఇంటి వద్ద వ్యాయామం చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐఇఆర్పి కమల్ కిషోర్, ఎంఆర్సి సిబ్బంది అశోక్,అంబదాస్,రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

