Breaking News

ఘనంగా వందేమాతరం గేయ ఆలాపన చేసిన వి కే డివిఎస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు

మన ప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అశ్వారావుపేటలో ఘనంగా వి కే డి వి ఎస్ రాజు జూనియర్ డిగ్రీ కళాశాల నందు వందేమాతరం గేయ గీతాలాపన చేసిన విద్యార్థులు,అధ్యాపకులు పుర ప్రముఖులు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వందేమాతర గేయాన్ని చాలా అద్భుతంగా మరియు ఆహ్లాదకంగా ఆలపించారు. ఈ సందర్భంగా వి కే డి ఎస్ రాజు జూనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు మాట్లాడుతూ వందేమాతరం రచించిన బకించంద్ర ఛటర్జీ యొక్క ప్రాముఖ్యత గురించి వందేమాతర గేయం స్వతంత్ర సమరయోధుల గుండెల్లో దేశభక్తిని ఎలా రగిలించిందని చాలా చక్కగా వివరించారు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి