మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కొత్తగట్టు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరింద్ర స్వామి 2026 బ్రహ్మోత్సవాలకు సంవత్సరం పాటు టెండర్ కు ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డి, ధర్మకర్తల ఆధ్వర్యంలో తీర్మారం చేయడం జరిగింది.ఆలయ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో భక్తుల సౌకర్యార్థం కొబ్బరికాయలు,పూజ సామాగ్రి కి టెండర్ వేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు మొకిరాల లక్ష్మణరావు,మీసా రవీందర్, తాడిచెర్ల తిరుపతి,రామగిరి తిరుమల, ఎడ్ల తిరుపతి,ఆలయ పురోహితులు శేషం మురళీధర్చార్యులు పాల్గొన్నారు.

