మన ప్రగతి న్యూస్ /|విశాఖపట్నం:
విశాఖ జూ పార్క్లో 12 ఏళ్ల ఆడ ఎలుగుబంటి అనారోగ్యంతో మృతి చెందింది. జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపిన వివరాల ప్రకారం,..ఎలుగుబంటి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. నాలుగు రోజుల క్రితం గర్భాశయంలో మిగిలిపోయిన పిండం (మమ్మీ ఫైడ్ ఫీటస్) కారణంగా సెప్టిసీమిక్ షాక్ వచ్చిందని తెలిపారు. వెటర్నరీ వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి శనివారం ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయిందని వివరించారు.
