మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో పార్టీ సీనియర్ నాయకుడు మాలోతి చరణ్ సింగ్ , పాండవుల శంకర్ లింగం, బత్తిని మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు.ఈ కార్యక్రమంలో కొండే అశోక్, మాసంపల్లి ప్రభాకర్, మాసంపల్లి అఖిల్, ముటిక శ్రీను, పొడిటి కిషోర్, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ యూత్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

