Breaking News

వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడో…..? కేవలం ప్రారంభానికి మాత్రమే పరిమితమైన వరి కొనుగోలు కేంద్రాలు

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో ఈనెల 4వ తేదీన స్థానిక పిఎసిఎస్ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ప్రారంభించి ఐదు రోజులు కావస్తున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏమాత్రం కూడా ప్రారంభం కాలేదు. కావున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి పది రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి మాత్రమే పరిమితం అవుతాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కావున ఇప్పటికైనా స్థానిక అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా వరి దాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి