రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్రగోర్ల రామారావు
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నరసాపురం గ్రామంలో ఘనంగా అమరవీరుల వర్ధంతి సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకుడు ఎర్రగొర్ల రామారావు మాట్లాడుతూ.భూమి,బుక్తి,విముక్తి పోరాటం లో వీర మరణం పొందిన అమరులకు మరణం లేదని,విప్లవ ఉద్యమం లో వారు జీవించి ఉంటారని,దున్నే వానికి భూములు కావాలని,దోపిడీ,రాపిడి, పీడన,అణిచివేత లేని,స్వేచ్ఛ గా బతికే సమాజం కావాలని,అందరికి సమాన అవకాశాలు ఉండే నూతన సమాజం నిర్మాణం కోసం ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలు ఇచ్చారాని,పిడిత ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారాని,వారి ఆశయాలు సాధించడానికి ప్రజాపంథా పోరాటాలే మార్గం అని,ప్రపంచ దేశాలలో సామ్రాజ్య పెట్టుబడి విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తున్నాయి అని,భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున్న తిరుగుబాటు వస్తున్నాయి అని,పాలక ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నాయి కానీ సమస్య పరిష్కారం చేయడం లేదని,ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేసి ఉద్యమాలని ఆపలేరు అని అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా గ్రామ నాయకులు మరియు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

