మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆర్.డి.ఓ కార్యాలయంలో ఆర్.డి.ఓ పార్థసింహారెడ్డి అధ్యక్షన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉండాలని తెలపడం జరిగింది మరియు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఉందా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలని ఎలక్షన్ సమయంలో నా పేరు గల్లంతయింది అని చెప్పకుండా తమ తమ బాధ్యతలుగా భావించి ప్రతి పౌరుడు ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆన్లైన్ కేంద్రంలో గాని తహసిల్దార్ కార్యాలయంలో గాని ఫామ్ నింపి ఇస్తే చేస్తారని తెలపడం జరిగింది ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్.రజాక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మరియు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పిట్ల హనుమంతు అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

