మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లీగల్ పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదీ మరియు 10 వేల రూపాయలు విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ( ఫోక్సో స్పెషల్ జడ్జ్. అదనపు ఇంచార్జి)ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి చంద్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామం కి చెందిన యువతి తన ఫిర్యాదులో మైనర్ అమ్మాయినీ చంద్రుగొండ మండలం తిప్పనపల్లి కి చెందిన సయ్యద్ లాలూ @ లాల్ మియా పై 2023 /08/06వ తేదీన అగాయిత్యం చేయగా అట్టి విషయం పైన చంద్రుగొండ పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ ఏం.రవి కేసు నమోదు చేసుకోగ, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ షేక్ అబ్దుల్ రెహమాన్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 14 మంది సాక్షులను విచారించారు. సయ్యద్ లాలు @ లాల్ మియా పై నేరం రుజువు కాగా జీవిత ఖైదీ, పదివేల రూపాయల జరిమానా జరిమానా చెల్లించనీ యెడల ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి నిర్వహించారు.కోర్టు నోడల్ ఆఫీసర్ఎస్సైడి.రాఘవయ్య ,లైజాన్ ఆఫీసర్ ఎస్. వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్) బి.లక్ష్మణ్ లు సహకరించారు.


