మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతుంది. రాష్ట్రంలో గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్న వారిని యూరిన్ టెస్ట్ కిట్ తో టెస్ట్ చేసి స్పాట్ లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు.గత కొన్నేళ్లుగా డ్రగ్స్,గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా గంజాయి దొరకుతుంది. అయితే ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు.కాప్స్ చేతికి ఆయుధాలు చిక్కాయి.సైబరాబాద్, కరీంనగర్,రామగుండం,నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్ లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.ఈ మేరకు ఆయా పీఎస్ లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

