Breaking News

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత!

-సీఐ సంజీవ్.

మన ప్రగతి న్యూస్/మానకొండూర్:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత,విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని మానకొండూర్ సీఐ సంజీవ్ అన్నారు.మంగళవారం బాలుర పాఠశాల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.సిఐ సంజీవ్ మాట్లాడుతూ.. కళాశాలల్లో విద్యార్థులు,యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను వారికి అవగాహన కలిగించాలన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు.విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.మాదకద్రవ్యాల వినియోగం,రవాణా పై ఎటువంటి సమాచారం తెలిసినా డయల్ 100, 1908 ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.ఈ ర్యాలీలో ఎమ్మార్వో విజయ్ కుమార్, సీఐ సంజీవ్ ఎంఈఓ మధుసూదనా చారి, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.