మన ప్రగతి న్యూస్/రామన్నపేట:
రామన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ సిబ్బంది తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియు సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్టి సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఆర్. సతీష్ అధ్యక్షత వహించారు. వీరి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. గౌరవాధ్యక్షురాలుగా నర్సింగ్ సూపర్డెంట్ 2 జె.రాణి,అధ్యక్షులుగా సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్,ఉపాధ్యక్షులుగా పి. శ్రీనివాస్ రేడియో గ్రాఫర్, ప్రధాన కార్యదర్శిగా టి శ్రీనివాస్ జూనియర్ అనలిస్ట్,కార్యదర్శిగా కేఏ సోలి,సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, కోశాధికారిగా జ్యోతి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షాజియా శిబా, వాసంతి రేష్మ ,సతీష్,సుశీల మొదలుగు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

