Breaking News

జర్నలిస్టు సాంబశివరావు మృతికి సంతాపం

టిడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో కుటుంబానికి ఆర్థికసాయం

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మీసేవ నిర్వాహకుడు ముక్తి సాంబశివరావు (40) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం వివిధ రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.మీసేవ ద్వారా కూలీ కూలీగా ప్రజలకు సేవలందిస్తూ అందరితో మమేకమై ఉండే సాంబశివరావు మరణం స్థానికులను తీవ్రంగా విషాదంలో ముంచేసింది. ఆయన మృతివార్త తెలిసిన వెంటనే ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, జానీ పాషా తదితరులు పలువురు ప్రముఖులతో మాట్లాడి రూ.1.30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు చరణ్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు సహకరించారు.జర్నలిస్టు సాంబశివరావు మృతిపై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, తోటకూరి శివయ్య, ధనియాకుల హన్మంతరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బావ్ సింగ్, మాజీ సర్పంచ్ అజ్మీరా రామదాస్, మాజీ ఎంపిటిసి సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య, జర్నలిస్టులు కోటగిరి రాము, తెల్లబోయిన రాము, కె. గోపి, ఎస్కే ఇబ్రహీం, చిలుముల శ్రీనివాస్ తదితరులు సంతాపం తెలిపారు.