Breaking News

గోలి పింగల్ రెడ్డిని కలిసి సన్మానించిన కొండమడుగు గ్రామ పెద్దలు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో దాతలు గోలి పింగల్ రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న గ్రామ పోచమ్మ దేవాలయం దాదాపు పూర్తయిన సందర్భంగా మర్యాదపూర్వకంగా పింగల్ రెడ్డిని కలిసి సన్మానించిన కొండమడుగు గ్రామ పెద్దలు.ఈ సందర్భంలో కొండమడుగు గ్రామంలోని సాయిబాబా టెంపుల్ నుండి అయ్యప్ప టెంపుల్ వయా చత్రకని గూడెం వెళ్లే దారిని డాంబర్ రోడ్ గ నిర్మించాలని కోరిన గ్రామ పెద్దలు విషయానికి సుముఖత తెలియజేసిన గోలి పింగల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజు గ్రామ పెద్దలు మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య,బీబీనగర్ మాజీ వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ కడెం సాయిలు,పెద్దలు ఎరుకల బిక్షపతి,జల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి