Breaking News

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు తొర్రూరు విద్యార్థిని హారిక ఎంపిక 

మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి:

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పసులాది హారిక ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుగొండ రమేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన హారికను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈనెల 18న వరంగల్  గల ఓ సిటీలో జరిగిన 14 సంవత్సరాల లోపు ఎస్ జి ఎఫ్ 69వ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు నుండి హారిక ఎంపికైందని తెలిపారు. ఈనెల చివరి వారంలో పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హారిక పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు హారిక ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన హారికను పాఠశాల పీఈటి కూటికంటి శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి