Breaking News

గచ్చుబావి అభివృద్ధికి 50,000 విరాళం

మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు

మన ప్రగతి న్యూస్/కల్వకుర్తి:
కల్వకుర్తి పట్టణంలోని ఎంతో పురాతనమైన గచ్చుబావి శిథిలావస్థలో ఉన్నటువంటి స్థితిలో స్థానిక యువత పెద్ద ఎత్తున తరలివచ్చి నిత్యం శ్రమదానం చేస్తున్న సందర్భంలో నేను సైతం మన ప్రాంత వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి అభివృద్ధికి సహకరిస్తానని కల్వకుర్తి పట్టణ 14వ వార్డు మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజులమధు దంపతులు 50 వేల రూపాయలు గచ్చుబావి అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా గచ్చుబావి అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ అభివృద్ధి పని చాలా వేగవంతంగా జరుగుతుంది పెద్ద ఎత్తున యువతీ యువకులు ప్రతిరోజు తరలివస్తున్నారు గచ్చిబావి మరియు శివాలయం అభివృద్ధిలో కల్వకుర్తి ప్రాంత ప్రజలు పాలుపంచుకోవాలని ఈ ప్రాంతంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుకుందామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నిత్యం శ్రమధానం చేస్తున్న యువతీ యువకులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి