మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి:
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాపసింగారం వాసి లక్ష్మణ్ కుమారుడు పవన్ (19) ఈ నెల 18 న మిత్రుడు వెంకట్ రెడ్డి (20) తో కలిసి బైక్ రిపేర్ చేయించుకుని, ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో.. బోడుప్పల్ దేవేందర్ నగర్ వద్దకు రాగానే అతివేగంగా దూసుకొచ్చిన ఆటో ట్రాలీ బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. పవన్ గాంధీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు. వెంకట్కి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పవన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

