మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో హెచ్ఎండిఏ నిధులు 20 లక్షలు,ఎంజి ఎన్ఆర్ఈఎస్ నిధులు 20లక్షలతో గ్రామ పంచాయతీ భవనము మరియు 5 లక్షల ఎస్సీ సబ్ ప్లాంట్ నిధులతో సీసీ రోడ్లల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.90 లక్షల రూపాయల నిధులతో పెంచికల్ పహాడ్ నుండి బాలనగర్ వరకు మంజూరైన నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.భువనగిరి మండలం రామచంద్రపురం లో 20 లక్షల హెచ్ఎండిఏ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు శంకుస్థాపన కేసారం గ్రామంలో హెచ్ఎండిఏ నిధులు16 లక్షలు ఎస్సీ సబ్ ప్లాంట్ 15 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ 12 లక్షల నిధులతో అంగన్ వడి భవనముకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్,పోతంశెట్టి వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,జిల్లా నాయకులు చిక్కుల వెంకటేష్,ఫకీర్ కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

