Breaking News

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/;ములకలపల్లి:

ములకలపల్లి మండలం కొబ్బరిపాడు గ్రామానికి చెందిన ఇర్ఫా వీరస్వామి తండ్రి నరసయ్య,54, కూలీ పని, 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎద్దుల చెరువు గ్రామానికి చెందిన బీర వెంకటరెడ్డి వద్ద వ్యవసాయ పని చేస్తుండేవాడు అప్పుడప్పుడు ములకలపల్లి మండలం కొబ్బరిపాడు గ్రామం లొ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వెళుతుండేవారు ఈ క్రమంలో ఇంటి నుండి బయల్దేరి 12 తారీఖు నవంబర్, న సాయంత్రం 7 గంటల సమయంలో కొబ్బరిపాడు నుండి వెలుగొండ వెళ్తూ మరుసటి రోజు విజయవాడ బస్ టైలర్ నుండి కుటుంబసభ్యులతో శరవాణి మాధ్యం ముతో మాట్లాడినా అదే రోజు సాయంత్రం నుండి అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు అతను ఆచూకీ వెతకగా ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీనిపై అతని కుమారుడు ఇర్ఫా రవీంద్ర కుమార్ ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై మధు ప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..