మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తోట దేవి ప్రసన్న జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు బానోత్ విజయ బాయి ఆదివారం ప్రత్యేకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బానోత్ విజయ బాయి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని మరింత శక్తివంతం చేయడానికి, స్థాయిలో కార్యకర్తలను ఐక్యపరచడానికి తోట దేవి ప్రసన్న నియామకం కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున పోరాటాల్లో కొత్త అధ్యక్షురాలి నాయకత్వం జిల్లా కాంగ్రెస్కు మరింత దృడతను తీసుకువస్తుందని అన్నారు.

