ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికారి శ్రీధర్
మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్
జిల్లా కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వరప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రతినెల దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వరప్రసాద్ కు ఫౌండేషన్ సూర్యాపేట జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేలాది మంది కి అనాధలకు, ఆర్తులకు , అనేక సేవా కార్యక్రమాలు కల్పిస్తూ దాదాపు రెండు కోట్ల రూపాయలు కేటాయించి, ఇన్సూరెన్స్ చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు కుమారుడు తాడోజు వరప్రసాద్ కి సూర్యాపేట టీం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ కమిటీ సభ్యులు పిడమర్తి లింగయ్య , మాజీ సర్పంచ్ దార శ్రీనివాస్, దువ్వ గిరి , శరత్ ,శంకర్, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి ,సయ్యద్ , సోమేశ్, లకపాక కృష్ణ, మంద కమలాకర్, పాల్గొన్నారు.

