Breaking News

ఎమ్మెల్యే కృష్ణ తోనే గండిపేట్ వెల్లుట్ల బీడీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి మండలంలోని అజమాబాద్ గండివేట్ వెల్లుట్లా బి.టి రోడ్ పనులు ఎమ్మెల్యే కృషి వలనే బీటీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి.
రూ 1.49 కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభం గ్రామాల్లో సంతోష వాతావరణం.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యంత అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అజమాబాద్ గండివేట్ వెల్లుట్లా బి.టి రోడ్ రూ.1.49 కోట్లు వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రారంభం కావడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగించింది.ఈ రహదారి నిర్మాణం కోసం మాజీ ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు రాకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొని ఉంది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్
మోహన్ గ్రామ మస్థులకుఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు నిరంతర ప్రయత్నాలు చేసి, రహదారి పనులు ప్రారంభమయ్యేలా చేశారు. గ్రామ ప్రజల కలను నిజం చేసిన నాయకుడిగా మదన్ మోహన్ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో అటవీ శాఖ నుంచి అనుమతులు లభించడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అడవి ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అనుమతులు పొందడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, ప్రజల ప్రయోజనాన్ని ప్రధానంగా పరిగణించిన ఎమ్మెల్యే విజ్ఞత్వంతో పనులు మళ్లీ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది.
స్థానిక గ్రామస్థులు వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నాళ్లుగా ఎదురు చూసిన మా సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి ధన్యవాదాలు.పలువురు హామీలు ఇచ్చారు. కానీ మాట నిలబెట్టిన నాయకుడు ఒక్కరే మదన్ మోహన్
ప్రజల అభివృద్ధి పట్ల అవిశ్రాంతంగా పనిచేస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మరోసారి నిరూపించుకున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి