మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్
పాల్వంచ పట్టణంలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ని సోమవారం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకుని,ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు.సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం పరస్పర సహకారంతో పనిచేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.


