- నిబంధనలకు విరుద్దంగా ఇటుక బట్టీలు
- మండి పడుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు
- సిండికేటుగా వ్యాపారుల దోపిడీ
- భారీగా పెంచిన ఇటుక ధర
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :
ఇటుక బట్టీ వ్యాపారుల దోపిడితో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ..ధరలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుండి భాహిరంగంగానే వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధరల్ని అమాంతం పెంచడంతో లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్న 5లక్షల రూపాయలలో దీనికే ఎక్కువ ఖర్చు అవుతుందని భాదను వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాలలో రోడ్డు పక్కనే ఇటుక బట్టీలు నిర్వహించడం చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన వ్యాపారులు ఇవేం పట్టించుకోరు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు గాలికి దందా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని, నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠినంగా అధికారులు వ్యవహరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజా ప్రభుత్వంను ప్రజలు, పర్యావరణ మరియు సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు.

