Breaking News

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

_ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్ఓ, ఏఆర్ఓ లకు శిక్షణ

మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల, జిల్లా

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్(ఏఆర్ఓ)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై మాట్లాడారు.సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ స్వీకరణ, పరిశీలన, స్క్రూటినీ, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల ప్రకారం చేయాలని సూచించారు. శిక్షణలో డీపీఓ శర్ఫుద్దిన్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.