మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల పరిధిలో డిసెంబర్లో జరగబోవు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు మెంబర్లు నామినేషన్ వేయడానికి ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్లను దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డితో కలిసి అశ్వరావుపేట సీఐ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ సెంటర్లో బందోబస్తు గురించి పలు సూచనలు చేశారు. మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున అందరూ తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించవలసిందిగా కోరారు.

