- బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముస్కె రాము..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక ఘట్టంగా, మరుపు రాని రోజుగా రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముస్కె రాము అన్నారు. తెలంగాణ వచ్చుడో – కేసిఆర్ సచ్చుడో అనే నినాదంతో.. కెసిఆర్ శవయాత్రాన లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర నా అని నవంబర్ 9, 2009 న ఆమరణ దీక్ష తెలంగాణ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర చరిత్రనే తిరగ రాసిందన్నారు. భవిష్యత్ తరాలకు దీక్ష – దివాస్ గొప్ప తనాన్ని తెలియ జేయాలని అన్నారు. నవంబర్ 29 కేసిఆర్ దీక్ష లేకుంటే.. డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే.. జూన్ 2 ఆవిర్బావదినం లేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న నీళ్ల దోపిడీ, నిధుల దోపిడీ లను ఇంకా సహించేదీ లేదంటూ గళమెత్తి, చావు నోట్లో తలకాయ పెట్టి ధైర్యంగా ముందుకు కదిలిన ధీరుడు కేసీఆర్ అని వారు అన్నారు. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ కి మని పవర్ లేదు. మజిల్ పవర్ లేదన్నారు. కానీ అనేక మంది రాజకీయ ఉద్ధాండులను తట్టుకొని సమైక్యవాధాన్ని వినిపించిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారేందరినో తట్టుకొని కలబడి, నిలబడి నటువంటి ఉద్యమ సింహం కేసిఆర్ అని అన్నారు. ఆనాటి దీక్ష ఫలితమే నేటి తెలం గాణ రాష్ట్రం, కేసిఆర్ సారధ్యంలో సాధించుకున్న తెలంగాణ పదేళ్ల పాటు అభివృద్ధి దిశలో ముందు కెళ్ళింది. దేశంలోనే అగ్రభాగంగా నిల్చింద న్నారు. తెలంగాణ ఉద్య మం ఉవ్వేత్తున ఎగిసి పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమైక్య వాదుల కాళ్లకు బూట్లు మోస్తురన్నారు. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రి గా ఉండటం తెలంగాణ ప్రజల దూరదృష్టం అని ఎద్దేవా చేశారు.

