Breaking News

నూతన డిసిసి సత్యనారాయణ గౌడ్‌ను అభినందించిన ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి,విజయ బాయి

మన ప్రగతి న్యూస్/ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా డిసిసి నూతన అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్‌ను శనివారం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామ్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయ బాయి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు శాలువా కప్పి సత్యనారాయణ గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు.పార్టీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా నూతన డిసిసి అధ్యక్షుడి బాధ్యతలు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. కొత్త నేతృత్వంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మరింత చురుకుదనం సాధిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..