మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్:
కల్లూరు డివిజన్ ఏసీపీ ఆదేశాల మేరకు శనివారం ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో రయట్ కంట్రోల్ డ్రిల్ను విస్తృతంగా నిర్వహించారు.లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు నిరంతర శిక్షణ అవసరమని ఉన్నతాధికారులు సూచించిన నేపథ్యంతో ఈ డ్రిల్ను చేపట్టారు.ఎస్సై ఎన్. సంధ్య నేతృత్వంలో స్టేషన్ సిబ్బంది అంతా పాల్గొన్న ఈ డ్రిల్లో షీల్డ్ ఫార్మేషన్లు,అడ్వాన్స్,రిట్రీట్ మూవ్మెంట్లు,లాఠీ వినియోగ పద్ధతులు, గుంపును చెదరగొట్టే క్రౌడ్-కంట్రోల్ టాక్టిక్స్ను ప్రాయోగికంగా అభ్యాసం చేశారు. పెద్ద ఎత్తున కూడే గుంపులు, ఆకస్మిక ఘర్షణలు, విభేదాలు, ర్యాలీలు వంటి పరిస్థితుల్లో చట్టపరంగా, నియంత్రితంగా పరిస్థితులను ఎలా నిర్వహించాలి అనే దానిపై సిబ్బందికి ప్రత్యక్ష మార్గనిర్దేశం అందించారు.డ్రిల్ అనంతరం ఎస్సై సంధ్య మాట్లాడుతూ…ఇటువంటి సాధన కార్యక్రమాలు పోలీసు బలగాల సిద్ధసామగ్రిని పెంచడమే కాకుండా, టీమ్వర్క్, కమ్యూనికేషన్, నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. అత్యవసర లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో సిబ్బంది వేగంగా, సమర్థవంతంగా స్పందించేందుకు ఈ డ్రిల్లులు ఎంతో ఉపయోగపడతాయి అని తెలిపారు.

