మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద దీక్ష దివస్ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భానికి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పట్ల గౌరవం తెలుపుతూ పుష్పాంజలి అర్పించారు.కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన అపార త్యాగాలను ఈ తరానికి తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజా ఉద్యమాల్లో ముందుండే ధైర్యసాహసాలు ఇంకా కొనసాగాలని, ఉద్యమ చరిత్ర గల బీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్య బలమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, వికలాంగుల హక్కుల ఉద్యమ నాయకులు, బీసీ ఉద్యమకారులను పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నాటి ఉద్యమ దశల నుంచీ నేటి వరకు బీఆర్ఎస్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న ఆబోతు రాజు యాదవ్, మోడెం రామకృష్ణ గౌడ్ ల సేవలను ప్రశంసించారు

