Breaking News

సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది

బీసీ వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

నర్సంపేట నియోజకవర్గ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను మనం కార్యకర్తలం అందరం కలిసికట్టుగా పని చేసి 99 శాతం గెలిపించుకొని ప్రతి గ్రామాలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మన గెలుపును ఎమ్మెల్యే మాధవ రెడ్డి కి మనం బహుమతిగా ఇవ్వాలని సమావేశంలో వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్స్ తిరుపతి మాట్లాడడం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా మహిళా నాయకురాలు అయినటువంటి పార్వతమ్మ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఎర్ర యాకుబ్ రెడ్డి,కత్తి కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.