Breaking News

ఇద్దరు మహిళ నాయకురాళ్ళ ను బహిష్కరించిన కాంగ్రెస్

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న
మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి
జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి తక్కళ్లపెల్లి ఉమా
లను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్.
గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజినీ భారతి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ వార్డు సభ్యులు తక్కళ్లపెల్లి ఉమా లను, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి శనివారం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్
ఈ సందర్బంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ మాట్లాడుతూ నేటి నుండి వీరికి కాంగ్రెస్ పార్టీతో గాని, పార్టీ కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..